మండపేటలో 21వ రోజుకు అంగన్వాడీల సమ్మె

Jan 1,2024 12:46 #Konaseema
anganwadi workers strike 21 day

ప్రజాశక్తి-మండపేట : తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేపట్టిన సమ్మె సోమవారం నాటికి 21వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పలువురు అంగన్వాడి నాయకులు మాట్లాడుతూ  పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత 21 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కనీస వేతనం 26000, గ్రాడ్యుయేట్, పిఎఫ్ అందించడంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడిలు నాయకులు ఆదిలక్ష్మి, బేబీ, వజ్రం, సూర్యకుమారి, కుమారి తదితరులు పాల్గొన్నారు.

➡️