ప్రజాశక్తి-మండపేట : వారి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద అంగన్వాడిలు చేస్తున్న సమ్మె శనివారం నాటికి 26వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అంగన్వాడీలు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పలువురు అంగన్వాడి నాయకులు మాట్లాడుతూ కనీస వేతనం 26000, గ్రాడ్యుయేట్, పిఎఫ్ అందించడంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు. సమస్యలు పరిష్కరించకుండానే సెంటర్లు తెరవాలని ప్రభుత్వం కలెక్టర్ ల ద్వారా ఆదేశాలు జారీ చేస్తుందని సెంటర్లు తెరవకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని ప్రభుత్వం చెబుతుందని ఇటువంటి తాటాకు చప్పుళ్ళకు అంగన్వాడీలు భయపడేదిలేదన్నారు. అంగన్వాడీలకు అన్ని ఇచ్చామని ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆమె ఖండించారు. సమస్యలు పరిష్కరించుకుంటే అంగన్వాడీ కేంద్రాలు తెరిచేది లేదని స్పష్టం చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అంగన్వాడిలు నాయకులు ఆదిలక్ష్మి, బేబీ, వజ్రం, సూర్యకుమారి, కుమారి తదితరులు పాల్గొన్నారు.
![anganwadi workers strike 26th day protest konaseema](https://prajasakti.com/wp-content/uploads/2024/01/anganwadi-workers-strike-26th-day-protest-konaseema.jpg)