ప్రజాశక్తి- పి.గన్నవరంఎన్నికల హామీల అమలు దిశగా సాధ్యం కాదన్న వారికి ఒక్కరోజులోనే పూర్తిస్థాయిలో పింఛన్లు పంపిణీ చేసి సిఎం చంద్రబాబు నాయుడు చూపించారని వాడ్రేవుపల్లి సర్పంచ్ ప్రత్తిపాటి ఉమామహేశ్వరి పేర్కొన్నారు. పి.గన్నవరం మండల పరిధిలో అన్ని గ్రామాల కంటే అత్యధిక శాతం పింఛన్లు పంపిణీ పూర్తి చేసినట్టు తెలిపారు. సోమవారం ఆమె ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేశారు. ఒక్కరోజులోనే పింఛన్ల పంపిణీ పూర్తి చేసిన అధికారులు, సచివాలయ ఉద్యోగులు, ఎఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీల సహకారంతో పంపిణీ పూర్తి చేశామని వారందరినీ ఆమె అభినందించారు.
![వాడ్రేవుపల్లిలో అధిక శాతం పింఛన్ల పంపిణీ](https://prajasakti.com/wp-content/uploads/2024/07/Untitled-1-copy-2.jpg)