ముమ్మరంగా వాహనాలు తనిఖీలు

Apr 11,2024 11:35 #Konaseema

ప్రజాశక్తి-రామచంద్రపురం : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వాహనాల తనిఖీని అధికారులు ముమ్మరం చేశారు. రామచంద్రపురం నియోజకవర్గంలో రామచంద్రపురం బైపాస్ రోడ్ లోనూ, ద్రాక్షారామ యానం రోడ్ లోని వేగాయమ్మ పేట వద్ద తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు ఉదయం నుండి రాత్రి వరకు కొనసాగిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో వాహనాల్లో నగదు, మద్యం, వంటివి తరలిస్తారని ముందు జాగ్రత్తగా తనిఖీలను ముమ్మరం చేశారు. వేగాయన్నపేట తనిఖీ కేంద్రం వద్ద డివిజనల్ ఇంజనీర్ సూర్యనారాయణ, పోలీసులు, కెమెరామెన్ సహకారంతో వాహనాల తనిఖీని చేపట్టారు. మే 13 ఎన్నికలు పూర్తయ్యే వరకు తనిఖీలు కొనసాగుతాయని ఈ సందర్భంగా డిఈ సూర్యనారాయణ వివరించారు. యానం నుండి ద్రాక్షరామ వరకు గల పరిసర ప్రాంతాల వాహనాలన్నీ ఈ మార్గం గుండా నే వస్తాయని దీనితో ముందస్తు జాగ్రత్తగా ఎన్నికల అధికారులు ఇక్కడ తనిఖీ కేంద్రం ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.

➡️