కార్మికులపై దాడి చేసిన వారిపై ఫిర్యాదు

Jul 3,2024 13:20 #Krishna district

ప్రజాశక్తి-గుడ్లవల్లేరు : గుడ్లవల్లేరు డ్యూటీలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులపై దాడి చేసిన సంఘటన కవుతరం గ్రామంలో చోటుచేసుకుంది. మండలంలోని కవుతరం గ్రామపంచాయతీ సురక్షిత మంచినీటి ఓవర్ ట్యాంకు వద్ద డ్యూటీ చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులైన మల్లీ, కొండపై అదే గ్రామానికి చెందిన నలుగురు యువకులు మంగళవారం సాయంత్రం దాడి చేసి గాయపరిచారు. దాడి చేసిన యువకులు చెరువు సమీపంలో అసంఘిక కార్యకలాపాలు చేస్తుండగా దానిని అడ్డుకునేందుకు పారిశుద్ధ్య కార్మికులు ప్రయత్నించగా వారిని కులం, వృత్తి పేరుతో నీచంగా దుర్భాషలాడి, దూషించి, గాయపరిచారు. ఈ విషయం తెలుసుకున్న ఏపీ పంచాయతీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి మర్రాపు పోలి నాయుడు బుధవారం ఆ గ్రామానికి చేరుకుని పంచాయతీ కార్యాలయంలోగ్రామ కార్యదర్శి సిహెచ్ ఉమామహేశ్వరావుతో చర్చలు నిర్వహించారు. అనంతరం బాధితులతో కలసి గుడ్లవల్లేరు పోలీస్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఎస్సై జి సత్యనారాయణకు దాడికి కారకులైన అంకాలరావు, ఈడే రాము, తాతారావు, అశోక్ లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కార్యదర్శి ఉమామహేశ్వరరావు ఫిర్యాదు చేశారు. సీఐటీయూ నాయకులు మద్దాల జగన్, గ్రామ పారిశుద్ధ కార్మికులు, గ్రామస్తులు ఉన్నారు.

➡️