ప్రాణ ప్రదాతలు వైద్యులు

Jul 1,2024 11:41 #Kurnool

కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు

ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : వైద్యులు ప్రాణప్రదాతలు అని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా డాక్టర్లకు కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంట్ సమావేశాలలో భాగంగా ఢిల్లీలో ఉన్న ఎం.పి ఓ ప్రకటనలో వైద్యులకు విషెస్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యుడిగా, స్వాతంత్ర్య సమరయోధుడిగా, విద్యావేత్తగా, రాజకీయవేత్తగా సేవలందించిన ప్రముఖ అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన వైద్య నిపుణుడు డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ అని అన్నారు. స్మారకార్థం జూలై 1ని భారతదేశం జాతీయ వైద్యుల దినోత్సవంగా జరుపుకుంటుందన్నారు. తల్లిదండ్రులు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మ ఇస్తారన్నారు. ఇక వైద్యులు అందించే సేవలు ఎనలేనివని అన్నారు. ప్రాణాన్ని కాపాడే ప్రత్యక్ష దైవాలే డాక్టర్లు అని కొనియాడారు.

➡️