ప్రజాశక్తి – ఎడ్యుకేషన్ : పదో తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాల్లో నగరంలోని లిటిల్ బ్రైన్స్ స్కూల్ విద్యార్థులు నూరు శాతం ఫలితాలు సాధించినట్లు స్కూల్ డైరెక్టర్, విద్యావేత్త ఫణి ప్రసాద్ ముక్తేవి తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. తమ పాఠశాల నుండి 16 మంది విద్యార్థులు హాజరుకగా అందరూ ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. జి.లక్ష్మి రామ్ 583 మార్కులు, 14 మంది 500 మార్కులకు పైగా సాధించినట్లు తెలిపారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/04/little-brains-1-1.jpg)