ప్రజాశక్తి-రెడ్డిగూడెం : ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం గ్రామానికి చెందిన నిరుపేదయైన రిక్షా కార్మికుడు గద్దల రాంబాబు గుండె పోటుతో శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు. ఈ విషయం “ఫ్రెండ్స్ సర్వీస్ సొసైటీ” స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా తెలుసుకున్న టిడిపి యువ నాయకుడు బొమ్మిన కోటేశ్వరరావు స్పందించి మానవతా దృక్పథంతో 5000/-రూ. ఆర్థిక సహాయం చేశారు. ఈ నగదును రాంబాబు భార్య థామస్ కు టిడిపి నాయకులు చాట్ల అచ్చియ్య, మాతంగి రామారావు, బండపల్లి శిఖామణి అందజేశారు.
![Bommina Koteswara Rao who provided financial assistance](https://prajasakti.com/wp-content/uploads/2024/02/Bommina-Koteswara-Rao-who-provided-financial-assistance.jpg)