ప్రతి ఉద్యోగి పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోవాలి

Apr 24,2024 22:27

ప్రజాశక్తి – విజయవాడ అర్బన్‌ : ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగులందరూ విధిగా పోస్టల్‌ బ్యాలెట్‌ని వినియోగించుకొని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వామ్యులు కావాలని ఫారం 12ని జమ చేయడానికి 26 ఏప్రిల్‌ 2024 ఆఖరి రోజు కాబట్టి, ఎన్నికల విధులకు నిర్దేశింపబడిన సిబ్బంది అందరూ సంబంధిత రిటర్నింగ్‌ అధికారులకు జమ చేయాలని రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును వినియోగించు కోవాలని జిల్లా జేఏసీ చైర్మన్‌ ఏపీ ఎన్జీవోస్‌ జిల్లా సంఘ అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్‌ తెలిపారు. ఉద్యోగులందరూ ఏ నియోజకవర్గంలో ఓటు ఉన్న సంబంధిత పనిచేస్తున్న నియోజకవర్గ ఫెసిలిటేషన్‌ సెంటర్లోనే ఓటు వేసుకోవడానికి అవకాశం ఉందని తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు పోస్టల్‌ బ్యాలెట్లు వేయడానికి వీలుగా ఏర్పాటు చేస్తున్న ఫెసిలిటేషన్‌ సెంటర్లు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గం ఆర్వో కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని కోరారు. మే 5న జరిగే పోస్టల్‌ బ్యాలెట్‌ కార్యక్రమంలో ఉద్యోగుల హాజరవ్వటానికి వీలుగా స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌ను ప్రభుత్వం ప్రకటించాలని కోరారు. ఫారం 12ను జమ చేయడానికి ఎటువంటి సాంకేతిక మరే ఇతర ఇబ్బందులు ఉన్నా ఎన్జీవో సంఘ కార్యాలయాన్ని సంప్రదించాలని ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు.

➡️