ప్రజాశక్తి-మైలవరం(ఎన్టీఆర్ జిల్లా) : మాజీ మంత్రి దేవినేని ఉమాకు మైలవరం టికెట్ తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇవ్వకపోవడంతో ఈరోజు సాయంత్రం 6 గంటలకు గొల్లపూడిలోని ఆయన కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభీష్టం మేరకు తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని ఉమా నాయకులు వద్ద పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కొంతమంది నాయకులు కార్యకర్తలు ఇండిపెండెంట్ గా ఉమా పోటీ చేయాలని ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/03/devineni-uma-rally.jpg)