పునరావస కేంద్రాలను పరిశీలించిన ఆర్డీవో రాజకుమారి

Dec 6,2023 12:37 #Guntur District
rdo visit cyclone effected areas

ప్రజాశక్తి-అమరావతి : మండల కేంద్రంలోని బండచేను, కాలచక్ర కాలనీ నీటి ప్రవాహంలో మునిగిపోవడంతో స్థానిక తాసిల్దార్ ఆధ్వర్యంలో పలోటి కాలేజీలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. బుధవారం ఆర్డిఓ రాజకుమారి పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. 52 గుడిసెలలో 156 మంది స్త్రీ పురుషులను మరో ఇద్దరూ గర్భిణీలను పునరావాస కేంద్రానికి తరలించామని తాసిల్దార్ విజయ శ్రీ తెలిపారు. స్థానిక ఎంపీటీసీ ఆలా వెంకట రాజ్యలక్ష్మి వారికి భోజన సౌకర్యాలు కల్పించారు. వైద్యులు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలని ఆమె వైద్య సిబ్బందికి సూచించారు. మరో రెండు రోజులపాటు ఇక్కడే ఉండాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఆలా లక్ష్మీనారాయణ, తాసిల్దార్ విజయ శ్రీ, పలోటి ఫాదర్ కిషోర్, తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది రాజశేఖర్, వీఆర్వోలు పాల్గొన్నారు.

➡️