ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : విశాఖ సిటీ నూతన పోలీస్ కమిషనర్ గా శంఖ బ్రత బాగ్చీ సోమవారం ఉదయం 7 గంటలకు నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ … విశాఖలో పనిచేయటం తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు. విశాఖ కేంద్రంగా గంజాయి తరలింపు జరుగుతుందని , ఇప్పటికే తమ శాఖ చేపట్టన ఆపరేషన్ పరివర్తన చాలా బాగా సక్సెస్ అయిందని చెప్పారు. స్థానికంగా కంటే ఇతర రాష్ట్రాల నుండి గంజాయి ఎక్కువగా వస్తుందని దానిని అరికట్టే చర్యలు చేపడతామని అన్నారు. నగర పోలీస్ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ … తామంతా ప్రజా సేవ చేస్తున్నామని ఎవరైనా పోలీస్ స్టేషన్ కి వస్తే మర్యాదగా వ్యవహరించాలని, అమర్యాదగా వ్యవహరించవద్దని అన్నారు. ఎవరైనా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇక్కడ పనిచేయడానికి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలిపారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/07/visaka.rtf.jpg)