ప్రజాసంక్షేమమే టిడిపి ధ్యేయం

Dec 5,2023 22:21

 కరపత్రాలు ప్రదర్శిస్తున్న నాయకులు, స్థానికులు

        మడకశిర : రాష్ట్ర ప్రజల సంక్షేమమే టిడిపి అధినేత చంద్రబాబు ప్రధాన ధ్యేయమని ఆపార్టీ పట్టణ అధ్యక్షులు మనోహర్‌, డాక్టర్‌ సెల్‌ అధ్యక్షులు కృష్ణమూర్తి తెలిపారు. ఈ మేరకు మంగళవారం పట్టణంలోని 11, 6, 19, 20 వార్డుల్లో బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని ఆపార్టీ నాయకులు నిర్వహించారు. ఈసందర్భంగా వారు ఇంటింటికి వెళ్లి టిడిపి రూపొందించిన మినీ మేనిఫెస్టో అంశాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా మైనార్టీ అధ్యక్షులు భక్తర్‌ సాబ్‌, మాజీ కౌన్సిలర్లు ఫయాజ్‌, మాజీ కోఆప్షన్‌ సభ్యులు రహంతుల్లా, నాగరాజు, తెలుగు యువత అధ్యక్షులు తిమ్మరాజు, బూత్‌ కన్వీనర్లు ఈరప్ప, రాజు, అసిదుల్లా, పట్టణ మహిళా అధ్యక్షురాలు అంజమ్మ, అంజప్ప తదితరులు పాల్గొన్నారు.టిడిపిలో పలువురు చేరిక : పట్టణంలో చేపట్టిన బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా పలువురు వైసిపి నాయకులు టిడిపిలో చేరినట్లు పట్టణ కన్వీనర్‌ మనోహర్‌ తెలిపారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి సమక్షంలో పట్టణానికి చెందిన వైసిపి నాయకుడు అశోక్‌ తెలుగుదేశం పార్టీలో చేరినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి జిల్లా మైనార్టీ అధ్యక్షులు భక్తర్‌ సాబ్‌, మాజీ కౌన్సిలర్‌ ఫయాజ్‌ , మాజీ కోఆప్షన్‌ సభ్యులు రహంతుల్లా, నాగరాజు, డాక్టర్‌ సెల్‌ అధ్యక్షులు కృష్ణమూర్తి, తెలుగు యువత అధ్యక్షులు తిమ్మరాజు తదితరులు పాల్గొన్నారు.

➡️