ఎన్నికల ప్రచారంలో వైసిపి అభ్యర్థి దీపిక
చిలమత్తూరు : సార్వత్రిక ఎన్నికల్లో బాలక్రిష్ణకు ఓటు వేస్తే హిందూపురం నియోజకవర్గంలో మళ్లీ పీఏల పాలనే వస్తుందని వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి దీపిక అన్నారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం చిలమత్తూరులో రోడ్డు షో నిర్వహించారు. ఈసందర్భంగా దీపిక మాట్లాడుతూ హిందూపురం నియోజక వర్గం లో టీడిపి చెబుతున్న అభివృద్ధి ఎక్కడా లేదని లీడర్లు మాత్రమే అభివృద్ధి అయ్యారని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను పేదలకు చేరవేస్తుంటే వాటిని కూడ అడ్డుకున్న దుర్మాఘమైన పార్టీ టిడిపి అని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో స్థానికంగా అందుబాటులో ఉండే తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్ రాజారెడ్డి, రెడ్డి కార్పొరేషన్ చైర్మేన్ జనార్థన్ రెడ్డి, అన్సర్, ఎంపిపి పురుషోత్తమ రెడ్డి, సర్పంచి సంద్య, వైసిపి యువనాయకులు రామక్రిష్ణ రెడ్డి, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.