సైకో పార్టీని రాష్ట్రం నుండి తరిమికొడదాం

May 10,2024 22:08

ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి బాలకృష్ణ

                   చిలమత్తూరు: వైసిపి పార్టీ సైకో పార్టీ అని అందుకే ఆ పార్టీని రాష్ట్రం నుండి తరిమికొట్టాల్సిన బాధ్యత ఓటర్లు తీసుకోవాలని టిడిపి హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ అన్నారు. శుక్రవారం మండలంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వ అచరాక పాలనకు కాలం చెల్లిందన్నారు. భూ యాజమాన్య హక్కు చట్టం పేరిట భూములను పెత్తందారులకు కట్టబెట్టేందుకు వైసిపి కుట్ర పన్నిందని ఆరోపించారు. టిడిపి రూపొందించిన సూపర్‌ సిక్స్‌లో నవరత్నాలకు మించిన సంక్షేమ పథకాలు ఉన్నాయని అన్నారు. ప్రచారం సందర్బంగా ఎమ్మర్పిఎస్‌ నాయకులు బేకరి గంగాధర్‌ బాలయ్య చేతుల మీదుగా ”మేలుకో దళితుడా” కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు రంగారెడ్డి ,మహిళ నాయకురాలు శ్రీదేవి, జెడ్పీటీసి అనూషా, బాలాజీ, నాగరాజు యాదవ్‌, నందీశప్ప తదితరులు పాల్గొన్నారు.

➡️