సింహాచలం
పజాశక్తి- శ్రీకాకుళం అర్బన్
వంశధార నిర్వాసితులకు చట్టబద్ధంగా రావా ల్సిన 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహా రం ఇవ్వాలని నిర్వాసితుల సంఘం రాష్ట్ర కార్యద ర్శి గంగరాపు సింహాచలం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. వంశధార నిర్వాసితుల పోరాట ఫలితంగా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పలాస పర్యటనకు వచ్చిన సందర్భంగా రూ.43 కోట్లు నిర్వాసితులు ఖాతాల్లో జమ చేయడాన్ని అభినందిస్తున్నామని అన్నారు. కానీ, యూత్ ప్యాకేజీలు, అదనపు ప్యాకేజీలు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకోవడం సరైంది కాదన్నారు. జగన్ ప్రతిపక్ష నాయకునిగా ఉన్నప్పుడు నిర్వాసితుల పోరాటానికి మద్దతు తెలియ జేస్తూ ఇచ్చినహామీ 2013 భూ సేకరణ చట్టం అమలు విర్తంజేయాలన్నారు. ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు చట్టబద్ధంగా 2013 భూ సేకరణ చట్టం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. భూములిచ్చి సర్వం త్యాగం చేశారని గుర్తు చేశారు. 2013 భూ సేకరణ చట్టం సాధన కోసం నిర్వాసితులంతా ఐక్యంగా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.