మాట్లాడుతున్న జాయింట్ కలెక్టర్ నవీన్
శ్రీకాకుళం అర్బన్: సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల లెక్కింపుపై సిబ్బందికి సంపూర్ణ శిక్షణ ఇచ్చామని జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, సబ్ కలెక్టర్ నూరుల్ కమర్ తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు నియమించిన మైక్రో అబ్జర్వర్లు, కౌంటింగ్ సిబ్బందికి స్థానిక ఆర్ట్స్ కళాశాలలో ఓట్ల లెక్కింపుపై మాక్ డ్రిల్ను సోమవారం నిర్వహించారు. కౌంటింగ్ డ్రై రన్ సందర్భంగా ఓట్ల లెక్కింపుపై సిబ్బందికి ఉన్న అనుమానాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ వంటి కీలక అంశాలపై స్పష్టమైన సూచనలు జారీ చేశామన్నారు.