‘వంశధార’ నీరు విడుదల

వంశధార ఎడమ కాలువకు హిరమండలం గొట్టాబ్యారేజీ వద్ద

నీటిని విడుదల చేస్తున్న ఎమ్మెల్యే గోవిందరావు

ప్రజాశక్తి – పాతపట్నం

వంశధార ఎడమ కాలువకు హిరమండలం గొట్టాబ్యారేజీ వద్ద పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సోమవారం నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొడ్డేపల్లి రాజగోపాలరావు వంశధార ప్రాజెక్టు గొట్టబ్యారేజీ ఎడమ కాలువ ద్వారా 1,48,200 ఎకరాలకు నీటిని విడిచిపెట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం బ్యారేజీలో రెండు వేల టిఎంసిల నీరుందని తెలిపారు. బ్యారేజీలో నీటి నిల్వలను బట్టి క్రమేణా నీటిని కాలువల్లోకి వదులుతామని చెప్పారు. కుడి, ఎడమ కాలువలకు ప్రాధాన్యతా క్రమంలో నీటిని విడుదల చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో వంశధార అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

 

➡️