సంక్షేమ పాలన జగన్‌తోనే సాధ్యం

రాష్ట్రంలో గడచిన ఐదేళ్లలో అర్హులైన ప్రతి కుటుంబానికి

మాట్లాడుతున్న రామ్‌మనోహర్‌ నాయుడు

శ్రీకాకుళం అర్బన్‌:

రాష్ట్రంలో గడచిన ఐదేళ్లలో అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించిన ఘనత జగన్మోహనరెడ్డికే దక్కుతుందని, ప్రస్తుత ఎన్నికల్లో ఆయనకే తిరిగి పట్టం కట్టాలని వైసిపి నాయకులు ధర్మాన రామ్‌ మనోహర్‌ నాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం గార మండలం అంపోలు, లింగాలవలస గ్రామాల్లో ఆయన పర్యటించి ఉపాధి కూలీలతో పని ప్రదేశంలో మాట్లాడారు. అన్నివర్గాల ప్రజలకు ఆర్థికంగా పైకి తేవాలన్న సిఎం జగన్మోహన్‌ రెడ్డి ఆలోచనలకు అండగా నిలవాలన్నారు. నియోజకవర్గంలో అభివృద్ది రెవిన్యూమంత్రి ధర్మాన వలనే సాధ్యమైందని, ప్రతి కుటుంబం ఇప్పుడు ఆనందంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు, గ్రామపెద్దలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

➡️