సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపును పురస్కరించుకుని మండలంలోని గాజులకొల్లివలస వద్ద ఉన్న సంగమేశ్వర స్వామి కొండ దిగువన సైకత శిల్పి గేదెల హరికృష్ణ ‘సింహాసనం అధిష్టించేది ఎవరో’ పేరిట సైకతశిల్పం రూపొందించారు. నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు సైకత శిల్పాలతో పాటు మధ్యలో సింహాసనంతో వేసిన సైకతశిల్పం పలువురిని ఆకట్టుకుంది.
– ప్రజాశక్తి, ఆమదాలవలస