ప్రజాశక్తి-డుంబ్రిగుడ (అల్లూరి) :ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మన్యం బంద్ డుంబ్రిగుడలో విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు వి.ఉమామహేష్ శ్వరావు మాట్లాడుతూ.. ఆదివాసీ స్పెషల్ డిఎస్పీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీఓ నెం.3రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించాలన్నారు. ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీలకే 100 శాతం ఉద్యోగులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ మాతృభాష వాలింటీర్ల రెన్యూవల్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఎస్.పోతురాజు, గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు టి.సూర్యనారాయణ, మండల కార్యదర్శి. పి.సత్యనారాయణ, బాష వాలింటీర్ల రాష్ట్ర నాయకులు. పి.కుమారి, మహిళ సంఘం నాయకురాలు కచ్చులమ్మ, టీడీపి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.