ప్రజాశక్తి -భామిని : మండలంలోని బాలేరు సమీపంలో బత్తిలి నుండి శ్రీకాకుళం వెళ్లే ఆర్టిసి బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసు కువెళ్లిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఎండ తీవ్రతతో కల్లు తిరగడంతో బస్సును నిలుపుదామన్న క్రమంలో అదుపుతప్పిందని డ్రైవర్ కె.బారికి తెలిపారు. ఈ సంఘటనలో ఒక్క ప్రయాణికుడుకి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.