స్విమ్స్‌లో 479 నర్సు పోస్టుల భర్తీటిటిడి పాలకమండలి నిర్ణయాలు

స్విమ్స్‌లో 479 నర్సు పోస్టుల భర్తీటిటిడి పాలకమండలి నిర్ణయాలు

స్విమ్స్‌లో 479 నర్సు పోస్టుల భర్తీటిటిడి పాలకమండలి నిర్ణయాలుప్రజాశక్తి – తిరుమల స్విమ్స్‌ ఆస్పత్రిలో 479 నర్సు పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్లు టిటిడి ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. టిటిడిలోని అన్ని కళాశాలల్లో సిఫార్సు లేకుండానే విద్యార్థులకు హాస్టల్‌ వసతి కోసం అదనంగా భవనాలు నిర్మించాలని నిర్ణయించారు. 2014కు ముందు టిటిడిలో నియమించిన కాంట్రాక్టు పొరుగు సేవా సిబ్బందిని రెగ్యులరైజ్‌ చేసేందుకు ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు తెలిపారు. యాత్రా సముదాయంలో లిఫ్ట్‌ల ఏర్పాటుకు 1.88 కోట్లు కేటాయించారు. బాలాజీనగర్‌ సమీపంలో ఫెన్సింగ్‌ ఏర్పాటుకు నిర్ణయించారు. 14 కోట్లతో టిటిడిలోని 188 క్వార్టర్స్‌ ఆధునీకరణ చేయనున్నారు. గోవిందరాజస్వామి ఆలయంలో బాష్యకార్ల సన్నిధిలో మకర తోరణం బంగారు తాపడానికి ఆమోదించారు. ఐటి సేవల కోసం రూ.12 కోట్లు కేటాయించారు. శ్రీవాని ట్రస్టు నిధులతో టిటిడిలోని పురాతన ఆలయాల మరమ్మతుకు ఆమోదించారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన శ్రీవారి ఆలయ ఉద్యోగి నరసింహన్‌ కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం ఇవ్వాలని తీర్మానించారు. టిటిడి మాజీ బోర్డు సభ్యులు పదేపదే రావొద్దు టిటిడి ధర్మకర్తల మండలి మాజీ సభ్యులకు సంవత్సరంలో కొన్నిసార్లు మాత్రమే వారి కుటుంబ సభ్యులతో (భార్యా పిల్లలతో) శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశాన్ని బోర్డు కల్పించిందని టిటిడి ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని, కుటుంబ సభ్యులతో కాకుండా ఇతరులను వెంట బెట్టుకుని పదేపదే తిరుమలకు రావడం మంచి పద్ధతి కాదన్నారు. మాజీ బోర్డు సభ్యుని హోదాలో కేవలం కుటుంబ సభ్యులతో మాత్రమే శ్రీవారి దర్శనానికి రావాలే తప్ప, ఇతరులను వెంట బెట్టుకుని వస్తే ఎటువంటి పరిస్థితుల్లోనూ శ్రీవారి దర్శనానికి అనుమతించేది లేదన్నారు.

➡️