కూటమి అభ్యర్థులకే బ్రాహ్మణ సంఘాల మద్దతు: అజరు కుమార్ ప్రజాశక్తి- తిరుపతి (మంగళం): రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చే బాధింపబడ్డ బ్రాహ్మణులందరం కలిసి కూటమి అభ్యర్థులకే మద్దతుగా నిలవాలని నిర్ణయించుకున్నామని బ్రాహ్మణ సంఘాల నాయకుడు కొత్తపల్లి అజరు కుమార్ స్పష్టం చేశారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణులకు రుణాలు ఇచ్చి వారి అభివద్ధికి బాటలు వేశారన్నారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఆ బ్రాహ్మణ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేసిందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో రాంప్రసాద్, వెంకటరామరాజు పాల్గొన్నారు.