సంస్కృత వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలి

సంస్కృత వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలి

సంస్కృత వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలిప్రజాశక్తి – క్యాంపస్‌ (తిరుపతి జిల్లా) సంస్కృత వారసత్వాన్ని భవిష్యత్‌ తరాలకు అందించాలని భారత ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్కడ్‌ పిలుపునిచ్చారు. సంస్కృత వర్సిటీ మూడో స్నాతకోత్సవం విశ్వ విద్యాలయంలోని ఇండోర్‌ స్టేడియంలో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయంలోని వివిధ కోర్సులలో ఉపాధి సాధించిన 580 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. 67 మంది విద్యార్థులకు బంగారు పతకాలను ఇచ్చారు. వైస్‌ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ జిఎస్‌ఆర్‌ క్రిష్ణమూర్తి ముఖ్య అతిథి జగదీప్‌ ధన్కడ్‌కు, విశిష్ట అతిథి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చి ఛాన్సలర్‌ గోపాలస్వామికి సాదర స్వాగతం పలికారు. మహౌమహౌపాధ్యాయ సాధు భద్రేశదాస స్వామి అనుగ్రహభాషణం చేశారు. విశ్వ విద్యాలయం ఛాన్సలర్‌ ఎన్‌.గోపాలస్వామి స్నాతకోత్సవాన్ని కులాధిపతిగా ప్రారంభించారు. వైస్‌ఛాన్సలర్‌ వివిధ కోర్సుల్లో ఉపాధి పొందిన 580 మంది విద్యార్థులకు ఉపస్థాపనం చేశారు. జగదీప్‌ ధన్కడ్‌ మాట్లాడుతూ సంస్కృత పాఠ్యాంశాలను అభ్వివృద్ధి చేయడం, ఇంటర్‌ డిసిప్లినరీ పరివోధనలను ప్రోత్సహించడం ద్వారా సంస్కృత వారసత్వాన్ని భవిష్యత్‌ తరాలకు అందించడం ద్వారా, ఆధునిక విద్యా అవసరాల మధ్య అంతరాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు. భారతీయ విజ్ఞాన వ్యవస్థలను తోసిపుచ్చే వలసవాద ఆలోచనా విధానం వల్ల ప్రధాన స్రవంతి విద్యలో సంస్కతం ఏకీకరణకు ఆటంకం ఏర్పడిందన్నారు. పురాతన రాతప్రతుల సంరక్షణలో డిజిటల్‌ టెక్నాలజీల వినియోగంలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలన్నారు. ఏ భాష అయినా సమాజం వినియోగించి, సాహిత్యం కూర్చినపుడే మనుగడ సాగుతుందన్నారు. సంస్కృతం పరివర్తనకు మార్గమని, అమూల్యమైన వారసత్వానికి విద్యార్థులు రాయబారులుగా మారాలన్నారు. కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ డాక్టర్‌ కె.సాంబశివమూర్తి పాల్గొన్నారు.

➡️