ఘన జీవామృతం తయారీ విధానం పై అవగాహన

Apr 30,2024 11:29 #preparation, #process, #solid Jeevamrit

ప్రజాశక్తి -బుచ్చయ్యపేట (అనకాపల్లి జిల్లా) : మండలంలో ఉన్న ఫి.భీమవరం గ్రామంలో రైతులకు కింజరపు ఎర్రమనాయుడు వ్యవసాయ కళాశాల ఎచ్చెర్ల విద్యార్థులు మంగళవారం ఘన జీవామృతం తయారీ విధానం పై అవగాహన కల్పించారు. జీవామఅతం వినియోగం వల్ల అధిక దిగుబడిలు వస్తాయని తెలిపారు. ఆవు మూత్రం, ఆవు పేడ, బెల్లం, శెనగపిండిని వినియోగించి తయారు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలోశశికళ, పూజిత, పల్లవి, షారోన్‌ తేజస్విని, ప్రత్యూష, రైతులు పాల్గొన్నారు.

➡️