ప్రజాశక్తి-సబ్బవరం
భారతదేశపు మొదటి హైడ్రోజన్ నగరంగా అవతరించడానికి విశాఖపట్నం సిద్ధంగా ఉందని ఐఐపిఇ డైరెక్టర్ ప్రొఫెసర్ శాలివాహన్ అన్నారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపిఈ), యుఎస్ఎలోని స్టోనీ బ్రూక్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా విశాఖలోని నొవోటెల్ హోటల్లో హైడ్రోజన్ గ్లోబల్ డీకార్బనైజేషన్స్ ఇండో-యుఎస్ వర్క్షాప్ మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైడ్రోజన్ ఉత్పత్తి ప్రాజెక్ట్కు మద్దతు ఇచ్చినందుకు ఎన్టిపిసికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కోర్సు యొక్క ప్రత్యేక ఉద్దేశాన్ని వివరిస్తూ బ్రేక్అవుట్ సెషన్లు చర్చలా ఉంటాయని, పాల్గొనేవారు మొదటి మూడు ప్రాధాన్యతలతో ముందుకు రావడానికి ప్రతి రోజు వ్యూహరచన చేస్తారని చెప్పారు. ముఖ్య అతిథి యుఎస్ఎ స్టోనీ బ్రూక్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ దేవేందర్ మహాజన్ మాట్లాడుతూ ”లక్ష్య-ఆధారిత పరిశోధన యొక్క ప్రాముఖ్యతను” నొక్కిచెప్పారు. వినూత్న హైడ్రోజన్ ఉత్పత్తి కార్యక్రమాలకు ఎన్టిపిసి- ఐఐపిఇల సహకారాన్ని ప్రశంసించారు. ఎన్టిపిసి ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్కె.సిన్హాతో కండెన్సర్ కూలింగ్ కోసం సముద్రపు నీటిని ఉపయోగించడం, 25 ఎండబ్ల్యూ ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్ను ఏర్పాటు చేయడం గురించి చర్చించారు. ఎన్టిపిసి 2032 నాటికి 130 జిడబ్ల్యూ కంపెనీగా అవతరించనుందని అంచనా వేశారు. ఎన్టిపిసి ప్రాజెక్ట్స్ డైరెక్టర్ యుకె.భట్టాచార్య 1 టిపిడి హైడ్రోజన్ ప్లాంట్, ప్రపంచ శక్తి సవాళ్లను పరిష్కరించడంలో రసాయన, ఎలక్ట్రోకెమికల్ ఇంజనీరింగ్ యొక్క సంభావ్యతను హైలైట్ చేశారు. హైడ్రోజన్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో, ప్రపంచ ఇంధన లక్ష్యాలను సాధించడంలో పరిశ్రమ-విద్యా భాగస్వామ్యాల కీలక పాత్రను వర్క్ షాప్ నొక్కి చెప్పింది. రిజిస్ట్రార్ రాంఫాల్ ద్వివేది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నిర్వాహకులను భాగస్వాములను అభినందించారు.