ప్రజాశక్తి – నరసాపురం
ఈ నెల 18వ తేదీన ఎపి సిపిఎస్ సంఘం ఆధ్వర్యంలో విజయవాడలో చేపట్టనున్న ధర్నాకు వెళ్లొద్దంటూ యుటిఎఫ్ నాయకులకు నరసాపురం పోలీసులు శుక్రవారం నోటీసులు అందజేశారు. ఈ మేరకు యుటిఎఫ్ నేతలకు నోటీసులు ఇవ్వడాన్ని సంఘం గౌరవ అధ్యక్షుడు ఎం.మార్కండేయులు ఖండించారు. నాయకులు అరెస్ట్ చేయడం, నోటీసులు ఇవ్వడం దుర్మార్గమని విమర్శించారు.