ప్రజాశక్తి – ముసునూరు
సిఎం జగన్ విద్యార్థుల కోసం అంగన్వాడీ దశ నుంచే ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నారని ఎంఎల్ఎ మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. మండల కేంద్రమైన ముసునూరు హైస్కూల్లో నిర్మించిన ఆదనపు తరగతులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి సభ్యులు డాక్టర్ ప్రతాప్, ఎంపిపి కొండా దుర్గాభవాని వెంకట్రావ్, వైస్ ఎంపిపి కోటగిరి రాజానాయన, సర్పంచులు పేరం కృష్ణ, రంగు ధనలక్ష్మి గాంధీ, రాజబోయిన శ్రీదేవి శ్రీనివాసరావు, సోషల్ మీడియా మండల కన్వీనర్ కంభాల దాసు, కంభాల రాంబాబు, ఎంపిడిఒ జి.రాణి, తహాశీల్దార్ దాసరి సుధ పాల్గొన్నారు.