గొప్ప ప్రజా నాయకుడు కొరటాల

ప్రజాశక్తి – భీమవరం టౌన్‌

నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడిన గొప్ప ప్రజా నాయకుడు కొరటాల సత్యనారాయణ అని సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం కొనియాడారు. సిపిఎం అగ్రనాయకులు కొరటాల సత్యనారాయణ వర్థంతి సభ పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగింది. ముందుగా సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బి.బలరాం మాట్లాడుతూ కొనియాడారు. కొరటాల కేంద్ర కమిటీ సభ్యులుగా, పాలిట్‌బ్యూరో సభ్యులుగా, రాష్ట్ర కార్యదర్శిగా, విద్యార్థి, యువజన నాయకునిగా విశేష సేవలందించారన్నారు. రాష్ట్రంలో రైతాంగ ఉద్యమం నిర్మించడంలో ప్రధానపాత్ర పోషించారన్నారు. గతంలో పత్తి రైతుల ఆత్మహత్యలు, రైతులు కిడ్నీలు అమ్ముకోవడం ఇలాంటి విషయాలన్నీ రైతు సంఘం నేత బోడేపూడి వెంకటేశ్వరరావుతో కలిసి ఈ విషయాలు వెలికితీయడంలో ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీయడంలో, రైతులకు సహకారాన్ని అందించడంలో కొరటాల సత్యనారాయణ గారు ప్రధాన పాత్రని వహించారని తెలిపారు. నాయకుల ఉద్యమ అనుభవాలతో కార్యకర్తలు ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జెఎన్‌వి.గోపాలన్‌, బి.వాసుదేవరావు, జిల్లా కమిటీ సభ్యులు ఎం.వైకుంఠరావు, పార్టీ సభ్యులు ఎం.ఆంజనేయులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️