నరసాపురం బస్టాండ్‌లో చోరీ

రూ.11 లక్షల నగదు, 400 గ్రాముల బంగారు నగలు అపహరణ
ప్రజాశక్తి – నరసాపురం
నరసాపురం బస్టాండ్‌లో భారీ చోరీ జరిగింది. వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన ఓ బంగారు వ్యాపారి బంగారు దుకాణాలకు ఆభరణాలు సరఫరా చేస్తాడు. ఈ క్రమంలో సోమవారం వ్యాపారం నిమిత్తం నరసాపురం వ్యాపారులకు నగలు ఇచ్చేందుకు తన గుమాస్తాను పంపించాడు. ఆయన వ్యాపారులకు బంగారు నగలు ఇచ్చి రూ.11 లక్షల నగదు, 400 గ్రాముల బంగారు ఆభరణాలతో తిరిగి గుంటూరు బయలుదేరారు. నరసాపురం బస్టాండ్‌లో బస్సు ఎక్కేందుకు కీటికిలో నుంచి ఆ నగదు, ఆభరణాలు ఉన్న బ్యాగును సీటులో వేసి బస్సు ఎక్కి చూసే లోపు బ్యాగ్‌ పోయిందని వాపోయాడు. దీంతో తన యజమానికి సమాచారం అందించాడు. మంగళవారం వ్యాపారి వచ్చిన తర్వాత వివరాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేయనున్నట్లు సమాచారం.

➡️