పెళ్లింటిలో దొంగతనం

Mar 28,2024 12:31 #West Godavari District

రూ 5 లక్షలు పైగా నగదు, నాలుగున్నర కాసుల బంగారు వస్తువులు చోరీ
ప్రజాశక్తి-పాలకొల్లు :  పాలకొల్లు సుబ్బారాయుడు గుడికి సమీపంలో బియ్యం వర్తకుడు బి నాగేశ్వరరావు కుమార్తె వివాహం సందర్భంగా ఇంట్లోని బీరువా బద్దలు గొట్టి గుర్తు తెలియని వ్యక్తులు రూ 5 లక్షలకు పైగా నగదు, నాలుగున్నర కాసుల బంగారు వస్తువులు దొంగిలించారు. పోలీసులు కథనం ప్రకారం రాత్రి రెండున్నర గంటలకు స్థానిక లైన్స్ క్లబ్ లో వివాహం జరుగుతుండగా పెళ్లికి కావలసిన ఒక వస్తువు కోసం ఇంటికి బంధువులు రాగా అప్పటికే దొంగలు ఇంటిలోని బీరువా బద్దలు కొట్టి సొమ్ము బ్యాగ్ లలో ఉంచారు. తలుపులు తెరుచుకొని ఉండటం, ఇంట్లో అలికిడితో ఎవరో ఉన్నారని సమాచారంతో దగ్గర బంధువులకు సమాచారం ఇచ్చారు. బయిట అలజడి గ్రహించి వెంటనే దొంగలు సొమ్ముతో పారిపోయారు. అక్కడ వెతికిన ఫలితం లేకపోయింది. గదిలోకి వెళ్లి చూడగా బీరువా తలుపులు పికిలించి పెళ్లి ఖర్చులకు ఉంచిన సొమ్ముతో పారిపోయారు. దీంతో పట్టణ సీఐ రమాదేవి, ఎస్ఐ బాదం శ్రీనివాస్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సిసిఎస్ సిఐ డి రాంబాబు వచ్చి దొంగతనం తీరును పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీం ను, డాగ్ ను రప్పిస్తున్నారు.

➡️