పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి సినీ హీరోలు అక్కినేని నాగార్జున, మహేష్బాబు సామాజిక మాధ్యమాల ద్వారా గురువారంనాడు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో ఉండాలి’ అంటూ మహేష్బాబు, ‘ఈ ఏడాది మీరు మరిన్ని విజయాలు సాధించాలి. నిండు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నా’ అంటూ నాగార్జున ట్వీట్ చేశారు.