‘సందీప్ కిషన్ హీరోగా ‘ఊరు పేరు భైరవకోన’ చిత్రం రాబోతోంది. వి.ఐ ఆనంద్ హెల్మ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి 9న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ చిత్రంలో వర్ష బల్లమ్మ కథానాయికగా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల సుంకర సమర్పణలో రాజేశ్ దండా నిర్మిస్తున్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/01/12-7.jpg)