రవితేజ, కావ్య థాపర్ జంటగా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ‘ఈగల్’ చిత్రానికి సీక్వెల్ రానుంది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం నుండి తాజాగా ఈ వార్త బయటకి వచ్చింది. ఈ రెండో భాగం ‘ఈగల్-యుద్ధకాండ’గా రానున్నట్టుగా వెల్లడించారు. మొదటి భాగంలో అనుపమ పరమేశ్వరన్, శ్రీనివాస్ అవసరాల, వినయ్ రాయ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. డేవ్ జాన్ద్ సంగీతం అందించారు.