బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మూడేళ్ల విరామం తర్వాత ‘బిఎస్ఎస్111’ పేరుతో కొత్త సినిమాలో నటించబోతున్నారు. బాలీవుడ్ ఛత్రపతి సినిమాలో నటించిన ఆయన కొన్ని రోజుల క్రితం టైసన్ చిత్రాన్ని ప్రారంభిం చారు. తాజాగా మరో కొత్త ప్రాజెక్టును ఆయన పట్టా లెక్కించారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పనుపమ పరమేశ్వరన్ మరోసారి జోడీగా కనిపించనున్నారు. గతంలో వీరిద్దరూ ‘రాక్షసుడు’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్స్ నం.8 పేరుతో సాహూ గారపాటి నిర్మిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్లో సోమవారంనాడు ‘బిఎస్ఎస్11’ ప్రాజెక్టు పూజా కార్యక్రమం జరిగింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్లుక్ విడుదలైన విషయం తెలిసిందే. హారర్-మిస్టరీ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది. వచ్చే ఏడాది విడుదల కానుంది.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/07/bs.jpg)