బిజీగా బెల్లంకొండ శ్రీనివాస్‌

తన నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్‌ యంగ్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌.. అల్లుడు శీను, జయ జానకి నాయక, రాక్షసుడు వంటి హిట్‌ సినిమాలతో దూసుకుపోయాడు. ఈహీరో తన క్రేజ్‌ని పెంచుకోవాడనికి.. ఛత్రపతి సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా అతనికి బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం శ్రీనివాస్‌..14 రీల్స్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ బ్యానర్‌పై వస్తున్న ‘టైసన్‌ నాయుడు’ షుటింగ్‌లో బిజీగా ఉన్నాడు.ఈ సినిమాకి సాగర్‌ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షుటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో పూర్తి కానుంది. దీంతోపాటు షైన్‌ స్క్రీన్స్‌ ప్రొడక్షన్స్‌తో మరియు మూన్‌షైన్‌ పిక్చర్స్‌తో చేతులు కలిపాడు. వీటి కోసం..మునుపెన్నడూ చూడని లుక్‌లో శ్రీనివాస్‌ కనిపించనున్నాడు అని తెలుస్తుంది.

➡️