శ్రీరామ్ కొత్త ప్రాజెక్టు ‘కోడి బుర్ర’ సోమవారం ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని వీ4 క్రియేషన్స్ బ్యానర్లో కంచర్ల సత్యనారాయణరెడ్డి, గట్టు విజరు గౌడ్, చిన్ని చందు, వట్టం రాఘవేంద్ర, సముద్రాల మహేశ్ గౌడ్ నిర్మిస్తున్నారు. చంద్రశేఖర్ కానూరి దర్శకత్వం వహిస్తున్నారు. శృతి మీనన్, ఆరుషి హీరోయిన్స్గా నటిస్తున్నారు. మహావీర్ మరో కీ రోల్ పోషిస్తున్నారు. ‘ఈ రోజు మా కోడి బుర్ర సినిమా ప్రారంభోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో శ్రీరామ్ గారిని కొత్తగా చూస్తారు. ఆయన ఇప్పటిదాకా లవ్, రొమాంటిక్ తరహా చిత్రాలు చేశారు. కోడి బుర్ర సినిమాలో పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తారు. హీరోయిన్ శృతి మీనన్ డాక్టర్ రోల్ చేస్తోంది. కోడి బుర్ర అందరికీ నచ్చేలా మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమా అవుతుందని నమ్ముతున్నాం’ అని దర్శకుడు ఈ సందర్భంగా చిత్ర విశేషాలు మాట్లాడారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/07/kodi-burra.jpg)