రామ్ చరణ్- విక్రమ్ రెడ్డి వి మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్పై ఓ చిత్రం రాబోతుందన్నది తెలిసిందే. నిఖిల్ హీరోగా, రామ్ వంశీకృష్ణ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం ‘ది ఇండియా హౌస్’గా తెరకెక్కుతోంది. తాజాగా హంపిలో ఈ చిత్ర ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించారు. నేటి నుంచి (జూలై 3న) రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుంది. సాయి మంజ్రేకర్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుండగా, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తమ ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ఇండియా హౌస్’ ప్రారంభమైనట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాలో పని చేస్తున్నారు. కెమరూన్ బ్రైసన్ డీవోపీ కాగా, విశాల్ అబానీ ప్రొడక్షన్ డిజైనర్. మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/07/indian.jpg)