కొత్త టాలెంట్ను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో దర్శక నిర్మాత రామ్గోపాల్ ఆర్జివి యువర్ ఫిలిం కాంటెస్ట్ను ఇటీవల నిర్వహించారు. ఈ పోటీకి వివిధ రాష్ట్రాల నుంచి వందల కొద్దీ ఎంట్రీలు వచ్చాయి. డైరెక్టర్ ఛాన్స్ కోసం 419 మంది వివిధ రాష్ట్రాల నుంచి దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ప్రతిభ కనబర్చిన వారిలో 11 మందిని షార్ట్లిస్ట్ చేశారు. వారు తీసిన సన్నివేశాలను యూట్యూబ్లో షేర్ చేసిన వర్మ ఎవరి డైరెక్షన్ బాగుందో చెప్పాలంటూ గత నెలలో యూట్యూట్లో పోల్ పెట్టారు. సోమవారం ఈ పోల్ ఫలితాలను వెల్లడించారు. నిరంజన్ నాగరాజ, గురుప్రసాద్ మనారి, అభిజీత్ సాయిరెడ్డిలను ఫైనలిస్టులుగా ప్రకటించారు. తాజాగా ఈ ముగ్గురిలో ఒకరిని విజేతగా ప్రకటించాల్సిన బాధ్యత మీదేనంటూ మళ్లీ ప్రేక్షకుల నిర్ణయానికే వదిలేశారు. వారు తెరకెక్కించిన వీడియోలు చూసి ఎవరి డైరెక్షన్ బాగుందో చెప్పాలంటూ యూట్యూబ్లో మరో పోల్పోస్టు పెట్టారు. ఇందులో ఎవరికైతే ఎక్కువ ఓట్లు పడతాయో వారితో వర్మ ఓ సినిమా తీస్తారు. ఆరునెలల్లో విడుదల చేస్తారు. వీక్షకులు ఎవరికి ఓటేస్తారో వేచి చూడాల్సిందే.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/07/rgv.jpg)