ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గిరిజనులు సాంప్రదాయ నృత్యాలతో అలరించారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ ఆధ్వర్యంలో గిరిజన శంఖారావ మహాసభ ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీలు సంప్రదాయ దుస్తుల్లో ఆటపాటలతో సందడి చేశారు. సమాజంలో ఆదివాసి జీవన ప్రమాణాలు పెరగాలి అనే నినాదంతో నిర్వహించిన ఈ సభలో తెలంగాణకు చెందిన మాజీ ఎంపీ ఆశ్మీరా సీతారాం నాయక్ తదితరులు ప్రసంగించారు. – ఫొటో : టివి రమణ
![](https://prajasakti.com/wp-content/uploads/2024/01/LAMABADI-DANCE-AT-THUMALAPALLI-4.jpg)