- చివరి బంతికి ఓడిన రాజస్తాన్
- భువనేశ్వర్ మ్యాజిక్ బౌలింగ్
హైదరాబాద్: ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్) సీజన్-17లో మరో ఉత్కంఠ పోరుకు ఉప్పల్ వేదికైంది. రాజస్తాన్ చివరి ఓవర్లో విజయానికి 13 పరుగులు చేయాల్సిన దశలో ఐదు బంతుల్లో 11పరుగులు రాబట్టి విజయానికి చేరువైంది. ఇక చివరి బంతికి రెండు పరుగులు చేస్తే రాజస్తాన్దే గెలుపు అన్న దశలో భువనేశ్వర్కుమార్ మ్యాజిక్ చేశాడు. ఆ బంతికి రాజస్తాన్ బ్యాటర్ రువన్ పావెల్ను ఎల్బీగా ఔట్ చేసి ఫలితాన్ని సన్రైజర్స్వైపు మళ్లించాడు. దీంతో స్టేడియంలో కూర్చున్న సన్రైజర్స్ అభిమానులంతా ఆనంద డోలికల్లో మునిగి తేలారు. ఛేదనలో రాజస్తాన్ ఓపెనర్ జైస్వాల్(67), రియాన్ పరాగ్(77) అర్ధసెంచరీతో రాణించారు. సన్రైజర్స్ బౌలర్లు భువనేశ్వర్కు మూడు, కమిన్స్, నటరాజన్కు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ భువనేశ్వర్ కుమార్కు దక్కింది.
తొలిగా బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు మరోసారి రెచ్చిపోయారు. రాజస్థాన్ రాయల్స్తో ఉప్పల్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 3వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్తో రికార్డు సృష్టించిన హైదరాబాద్ ఆటగాళ్లను రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు ఆది నుంచి కట్టడి చేశారు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 37 పరుగుల వద్దే పరిమితమైంది. ఐదో ఓవర్లో అవేశ్ ఖాన్ వేసిన తొలి బంతికి షాట్ ఆడేందుకు ప్రయత్నించి అభిషేక్(12) ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన అన్మోల్ప్రీత్(5) తొలి బంతికే ఫోర్ బాదాడు. కానీ ఆరో ఓవర్లో సందీప్ శర్మ వేసిన బంతికి జైస్వాల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో రెండు కీలక వికెట్లను కోల్పోయిన సన్రైజర్స్ కాసేపు నిలకడగా ఆడింది. కానీ 9వ ఓవర్ నుంచి ట్రావిస్ హెడ్ (58) దూకుడు పెంచాడు. అతనికి నితీశ్రెడ్డి జత కలిశాడు. దీంతో ఇద్దరూ కలిసి చెరో హాఫ్ సెంచరీతో జట్టుకు కీలకమైన స్కోర్ అందించారు. అయితే అవేశ్ ఖాన్ వేసిన 15వ ఓవర్లో మూడో బంతికి స్టంపౌట్ నుంచి తప్పించుకున్నప్పటికీ.. నాలుగో బంతికి హెడ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. హెడ్ ఔటవ్వడంతో క్రీజులోకి వచ్చిన క్లాసెస్ (40) కూడా రాణించాడు. దీంతో సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.