తమిళనాడు : ప్రముఖ తమిళ గాయని ఉమా రామనన్ (72) చెన్నైలోని తన నివాసంలో బుధవారం (మే 1) న కన్నుమూశారు. అనారోగ్య కారణంగా ఆమె మృతి చెందినట్లు తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియలేదు. ఉమా తమిళ చిత్రసీమలో ఎన్నో చిరస్మరణీయమైన పాటలు పాడి శ్రోతల మన్ననలను పొందారు. ఉమాకు భర్త ఏవీ.రమణన్, కుమారుడు విఘ్నేష్ రమణన్ ఉన్నారు. ఆమె అంత్యక్రియలకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.