కొలంబో వేదికగా శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ మధ్య కొలంబోలో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుని ఆఫ్ఘనిస్థాన్ను 198 పరుగులకు అలౌట్ చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన శ్రీలంక రెండో కూడా బ్యాటింగ్ కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఇన్నింగ్స్ 48వ ఓవర్ వద్ద మైదానంలో బౌండరీ లైన్ వద్ద ఉడుము దర్శనమిచ్చింది. దాంతో మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది. ఎట్టకేలకు దాన్ని మైదానం బయటకు పంపించడంతో మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది. గతంలో శ్రీలంకలో ఓ క్రికెట్ మైదానంలో పాము కూడా వచ్చిన విషయం తెలిసిందే.