ముంబై వేదికగా ఆస్ట్రేలియా-భారత మహిళ జట్ల మధ్య జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ 3వ రోజు ఆట ముగిసే సమయానికి 46 ఆసీస్ పరుగుల అధిక్యంలో ఉంది. ఆసీస్ బ్యాటర్లలో బెత్ మూనీ 33, ఫోబ్ లిచ్ఫీల్డ్ 18, ఎల్లీస్ పెర్రీ 45, తహ్లియా మెక్గ్రాత్ 75, అలిస్సా హీలీ 32 పరుగులు చేసి ఔటయ్యారు. అన్నాబెల్ సదర్లాండ్ 12, ఆష్లీ గార్డనర్ 7 పరుగులు చేసి నాటౌట్గా ఉన్నారు. భారత బౌలర్లలో స్నేహ రాణా, హర్మన్ప్రీత్ కౌర్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/cricket-4.jpg)