విశాఖ : విశాఖపట్నం వైఎస్ఆర్ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ ఉత్కంఠ రేపుతోంది. సోమవారం భారత్-ఇంగ్లాండ్ల మధ్య ఆట నాలుగోరోజు ప్రారంభమైంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 67 పరుగులకే 1 వికెట్ కోల్పోయి విజయానికి 332 పరుగులు చేయాల్సి ఉంది. దీంతో నాలుగో రోజు ఆట ఉత్కంఠతను రేకెత్తించింది. ఇంగ్లండ్ను తొలి ఇన్నింగ్స్లో 253 పరుగులకు ఆలౌట్ చేసిన టీమింయా, రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. కానీ, మూడో రోజు భారత్ అన్ని వికెట్లు కోల్పోయి 227 పరుగులు మాత్రమే చేయగలిగింది.ఈ 227 పరుగులలో శుభ్మన్ గిల్ 104 పరుగులు చేశారు.
శుభ్మన్ మినహా భారత బ్యాట్స్మెన్ ఎవరూ పెద్ద ఇన్నింగ్స్ను పూర్తి చేయలేకపోయారు. ఒత్తిడిలో ఉన్న గిల్ 147 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 104 పరుగులు చేశారు. శుభ్మన్తో పాటు అక్షర్ పటేల్ 45 పరుగులతో ఇన్నింగ్స్ ఆడగా, శ్రేయాస్ అయ్యర్, ఆర్ అశ్విన్ చెరో 29 పరుగులు చేశారు. తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ బాదిన యశస్వి జైస్వాల్ 17 పరుగులకే అలసిపోయారు. సిరీస్ మొత్తంలో పరుగుల కరువుతో సతమతమవుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ కూడా 13 పరుగులకే పెవిలియన్ చేరారు. మిగతా బ్యాటర్లలో కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా సున్నాకి ఔట్ కాగా, మిగిలిన ముగ్గురు రెండంకెల స్కోరును చేరుకోలేకపోయారు. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ తరపున టామ్ హార్ట్లీ 4 వికెట్లు తీయగా, రెహాన్ అహ్మద్ 3 వికెట్లు, జేమ్స్ అండర్సన్ 2 వికెట్లు తీశారు. 399 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బెన్ డక్లెట్ 27 బంతుల్లో 28 పరుగులు చేసి ఔటయ్యారు. అయితే, జాక్ క్రాలే 29, రెహాన్ అహ్మద్ 9 పరుగులు చేసి నాలుగో రోజు బ్యాటింగ్ కొనసాగించారు. భారత్ రెండో ఇన్నింగ్స్లో ఆర్.అశ్విన్ 1 వికెట్ తీశారు.