ముంబై వేదికగా జరిగిన ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్లో భారత మహిళలు ఘన విజయం సాధించారు. ఈ టెస్టులో ఆస్ట్రేలియా మొదట ఇన్నింగ్స్ లో 219 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్ 4, స్నేహ రాణా 3, దీప్తి శర్మ 2 వికెట్లతో సత్తా చాటారు. అనంతరం టీమిండియా మహిళలు తమ తొలి ఇన్నింగ్స్ లో అదరగొట్టారు. ఓపెనర్లు షెఫాలీ వర్మ (40), స్మృతి మంథన (74) తొలి వికెట్కు 90 పరుగులు జోడించి శుభారంభం అందించారు. రిచా ఘోష్ 52, జెమీమా రోడ్రిగ్స్ 73, దీప్తి శర్మ 78, పూజా వస్త్రాకర్ 47 పరుగులు చేయడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 406 పరుగుల భారీ స్కోరు సాధించింది. రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 261 పరుగులకే కుప్పకూలింది. స్నేహ రాణా 4, రాజేశ్వరి గైక్వాడ్ 2, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 2 వికెట్లు తీశారు. దాంతో, 75 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత మహిళల జట్టు కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. స్మృతి మంథన (38 నాటౌట్), జెమీమా రోడ్రిగ్స్ (12 నాటౌట్) జట్టును గెలిపించారు.