ముంబై : చాలాకాలం తర్వాత క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన సూర్యకుమార్ డకౌట్ అయ్యాడు. నోర్జే బౌలింగ్లో ఫ్రేసర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకు ముందు 27 బంతుల్లో 49 పరుగులు చేసిన రోహిత్ శర్మ అక్షర్ పటేల్ బౌలింగ్లో రోహిత్ క్లీన్ బౌల్డయ్యాడు. 42 పరుగులు చేసిన ఇషాన్ కిషాన్ కూడా శర్మ అక్షర్ పటేల్ బౌలింగ్లోనే ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ కేవలం 6 పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. ప్రస్తుతం పాండ్య 31, టీమ్ డేవిడ్ 10 పరుగుల మీద బ్యాటింగ్ చేస్తున్నారు. 16 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 150/4గా ఉంది.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/04/sky.jpg)