తెలంగాణ : రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ … (అఖిల భారత విద్యార్థి పరిషత్) ఎబివిపి నాయకులు మంగళవారం మధ్యాహ్నం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళనకారులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. తక్షణమే ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన నిరుద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో వారు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/07/abvp-protest.rtf.jpg)