బీజింగ్ : చంద్రుడిలోని చీకటి భాగంలోకి చైనా ఉపగ్రహాన్ని ప్రయోగించింది. లాంగ్ మార్చ్ 8 రాకెట్పై క్యూకియావ్-2 అనే 1.2 టన్నుల శాటిలైట్ను హైనాన్ ప్రావిన్స్ నుంచి బుధవారం ఉదయం చైనా ప్రయోగించింది. సాధారణంగా చంద్రుడిపై మనకు కనిపించే భాగం నుంచి భూమిపైకి సమాచారం పంపడం సులువు. కానీ, అవతలి భాగం నుంచి కమ్యూనికేషన్లను నెలకొల్పడం అసాధ్యం. తాజాగా చైనా ప్రయోగించిన క్యూకియావ్-2 చంద్రుడి చుట్టూ తిరుగుతూ మేలో చైనా ప్రయోగించనున్న ఛాంగి-6 మిషన్ నుంచి సంకేతాలను భూమిపైకి ప్రసారం చేయాల్సి ఉంటుంది. చాంగి ప్రాజెక్టులో భాగంగా చంద్రుడి ఆవలివైపు ఉన్న మట్టి ఇతర ఖనిజాలను చైనా సేకరించనుంది. 2026లో ప్రయోగించాలనే లక్ష్యంతో పెట్టుకొన్న చాంగి-7, 2028లోని చాంగి-8కు కూడా ఈ ఉపగ్రహం సహకరించనుంది. అంతేకాదు.. చంద్రుడిపైకి తలపెట్టిన మానవ యాత్రలకు, ఇతర గ్రహాలపై కార్యకలాపాల నిర్వహణలోనూ కమ్యూనికేషన్స్ను చైనా దీని నుంచే జరపనుంది. క్యూకియావ్ జీవిత కాలం 8 సంవత్సరాలు. కాగా, తాజా ప్రయోగంలోనే టియాండు-1,2 అనే మినీ ఉపగ్రహాలను కూడా పంపింది. ఇవి కమ్యూనికేషన్ నెట్వర్క్ సమూహాన్ని ఏర్పాటు సాధ్యాసాధ్యాలను వీటి ద్వారా పరీక్షించనుంది. చంద్రుడి దక్షిణ ధ్రువంలో నిర్మించ తలపెట్టిన పరిశోధనశాలకు ఇవి నేవిగేషన్, రిమోట్సెన్సింగ్, కమ్యూనికేషన్ సేవలు అందిస్తాయి.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/03/22-13.jpg)